బజార్హత్నూర్, జూన్ 11 : సభ్యత్వం, ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే అనీల్ జాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పార్టీ సభ్యత్వం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలన్నారు. ఎస్ఐఆర్ ద్వారా ప్రజలు నష్టపోకుండా చూడలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి..
బోథ్, జూన్ 11 ః అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. గురువారం బోథ్లో ప్రధాన రహదారిపై నిల్వ ఉన్న మురికి నీటిని గురువారం పరిశీలించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. తక్షణమే నిల్వ ఉన్న నీటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.