కాగజ్నగర్టౌన్ : గోండు విప్లవకారుడు కుమ్రం భీం అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్నగర్ మండలంలో కుమ్రం భీం విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల్.. జంగిల్.. జమీన్ కోసం పోరాడి అమరుడైన కుమ్రం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా రూ. 51వేలు కమిటీకి అందించనున్నట్లు తెలిపారు.
డివిజన్ కేంద్రంలో కుమ్రం భీం విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించి, ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు గిరిజనులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, ఆదివాసి పెద్దలు కుమరం మాంతయ్య, సిడం సకారం, ఆత్రం రాంషా, రంగన్న, తలండి లక్ష్మణ్, మడావి పోచాని, నియోజకవర్గంలోని ఆదివాసి సర్పంచ్లు, గిరిజన ఉపాధ్యాయులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.