రాష్ట్రస్థాయిలో ఆసిఫాబాద్ అ‘ద్వితీయం’.. ‘ప్రథమ’లో తృతీయ స్థానం
ఉత్తమ మార్కులతో టాపర్లుగా ఉమ్మడి జిల్లా విద్యార్థులు
సత్తా చాటిన గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ కళాశాలలు
ఈనెల 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపునకు చాన్స్
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను హైదరాబాద్లో మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలవగా, ప్రథమ సంవత్సరంలో మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఈసారి గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈనెల 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు కూడా అవకాశం కల్పించారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 28: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కాగా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ సారి బాలికలే టాప్లో నిలిచా రు. కరోనాతో గడిచిన రెండేళ్లు పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రక టించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం వొకేషనల్ పరీక్షా ఫలి తాల్లో 74 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలి చింది. వొకేషనల్ ప్రథమ ఫలితాల్లో 63 శాతం ఉత్తీర్ణతతో తృతీ య స్థానంలో నిలిచింది. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 68 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8వ స్థానం, ఇంటర్ ప్రథమ ఫలితాల్లో రాష్ట్రంలో 64 శాతంతో 9వ స్థానంలో నిలిచింది.
ఫలితాలు ఇలా..
ఇంటర్ జనరల్ ప్రథమ సంవత్సరంలో బాలురు 4596 మంది పరీక్ష రాయగా 2652మంది ఉత్తీర్ణులై 57శాతం, బాలికల్లో 4489 మంది పరీక్ష రాయగా 3238 మంది ఉత్తీర్ణులై 72 శాతం ఫలితాలు సా ధించారు. ఇంటర్ ప్రథమలో మొత్తం 9085 మంది పరీక్షలకు హాజరు కాగా 5890 మంది ఉత్తీర్ణులై 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలురు 4380మంది హాజరుకాగా 2741మంది ఉత్తీర్ణులై 62శాతం, బాలికలు 4153 మంది పరీక్షలు రాయగా 3126 మంది ఉత్తీర్ణులై 75 శాతం, మొత్తం 8533మంది పరీక్షలు రాయగా 5867 మంది ఉత్తీర్ణత సాధించి, 68శాతం ఫలితా లు సాధించారు. ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 1022 మంది పరీక్షలు రాయగా, 647 మంది ఉత్తీ ర్ణులై 63 శాతంతో తృతీయ స్థానం సాధించగా, ద్వితీ య సంవత్సరంలో 933మంది పరీక్షలకు హాజరు కాగా 692మంది ఉత్తీర్ణులై 74శాతం ఫలితా లతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిం చనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 30 నుంచి సంబంధిత అభ్యర్థులు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కూడా అవకాశం కల్పి స్తున్నామన్నారు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్డ్ ఇంటర్ ఫలి తాలు కూడా వెల్లడిస్తామని చెప్పారు.
జీజేసీ విద్యార్థుల సత్తా..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధిం చారని కళాశాల ప్రిన్సిపాల్ భగవాండ్లు తెలిపారు. కళాశాలలో ఇంటర్ ప్రథమ బైపీసీలో చదువుతున్న ఎం శ్వేత 440మార్కులకు గాను 424, కే స్రవంతి 418మార్కులు, కే గాయత్రి 395మార్కులు, ఎంఎ ల్టీలో ఉషారాణి 500 మార్కులకుగాను 483, ఎస్కే సిమ్రాన్ 472 మార్కులు సాధించినట్లు చెప్పారు. వీరిని జిల్లా ఇంటర్మీ డియెట్ బోర్డు అధికారి రవీంద్ర కుమార్ అభినందించారు.
మంచిర్యాల అర్బన్, జూన్ 28 : విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఇంటర్ ఫస్టియర్ బైపీసీ విభాగంలో పట్టణంలోని ఆల్ఫోర్స్ కళాశాలకు చెందిన డీ సుమజ్ఞ 437 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. బైపీసీ సెకండియర్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థి 987 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. ఎంపీసీ ఫస్టియర్లో 464 మార్కులతో మిమ్స్ కళాశాల విద్యార్థులు మంజుల, తేజశ్విని, రోహిత్, వర్షిణి ప్రతిభ చాటారు. ప్రభుత్వ కళాశాలల్లో మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థి సుప్రిత ఎంపీ సీ విభాగంలో 960 మార్కులతో జిల్లా ర్యాంకు సాధించింది. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 53 శాతంతో 30వ స్థానంలో నిలువగా, ఒకేషనల్ విభాగంలో 56 శాతంతో 11వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్ జనరల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 64 శాతం ఉత్తీర్ణత శాతంతో 24వ స్థానంలో నిలువగా ఒకేషనల్ విభాగంలో 63 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలిచింది.
ఇంటర్లో మెరుగైన పలితాలు…
ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో 6,629 మంది పరీక్షలు రాయగా, 3,546 మంది ఉత్తీర్ణత (53 శాతం) సాధించారు. ఒకేషనల్ విభాగంలో 1,315 మందికిగాను 741 మంది ఉత్తీర్ణత (56 శాతం) సాధించారు. అలాగే సెకండియర్ జనరల్ విభాగంలో 6,529 మందికిగాను 4,188 మంది ఉత్తీర్ణత (64 శాతం) సాధించగా, ఒకేషనల్ విభాగంలో 1,272 మందికిగాను 812 మంది ఉత్తీర్ణత (63 శాతం) సాధించారు. అలాగే జిల్లాలో ప్రైవేట్గా పరీక్ష రాసిన సెకండియర్ జనరల్ విభాగంలో 118 మందికిగాను 40 మంది ఉత్తీర్ణత (33 శాతం) సాధించగా, ఒకేషనల్ విభాగంలో 12 మందికిగాను ఆరుగురు (50 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
బాలికలదే హవా..
ఇంటర్ ఫలితాల్లో బాలురకంటే బాలికలదే పైచేయిగా నిలిచింది. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 3,546 మంది ఉత్తీర్ణత సాధించగా ఇందులో 2,269 మంది (63 శాతం), 1,277 మంది (41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేష నల్ విభాగంలో 741 మందికిగాను 418 మంది బాలికలు (71 శాతం), 323 మంది (44 శాతం) బాలురు ఉత్తీర్ణుల య్యారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 4,188 మంది ఉత్తీర్ణత సాధించగా ఇందులో 2,509 మంది (71 శాతం) బాలికలు, 1,679 మంది (55 శాతం) బాలురు పాసవగా ఒకేషనల్ విభాగంలో 812 మందికి గాను 408 మంది బాలికలు(76 శాతం), 404 మంది బా లురు (54 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. సెకండియర్లో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానంలో నిలువగా, మొదటి సంవత్సరంలో మూడో స్థానంలో నిలిచింది. బాలురతో పోలిస్తే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,426 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,200 మంది ఉత్తీర్ణత సాధించారు. 72 శాతం ఫలితాలు వచ్చాయి. ఫస్టియర్లో 2,072 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 1,354 మంది ఉత్తీర్ణత సాధించారు. 65 శాతం ఫలితాలు సాధించారు. బాలికలు 2,354 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,846 మంది ఉత్తీర్ణత సాధించి 78 శాతం ఫలితాలు నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,060 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 3,144 మంది ఉత్తీర్ణులై 77 శాతం ఫలితాలు సాధించారు. వీరిలో బాలురు 2,069 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,563 మంది ఉత్తీర్ణత సాధించి 75 శాతం ఫలితాలు సాధించారు. బాలికలు 1,991 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,581 మంది ఉత్తీర్ణులై 79 శాతం ఫలితాలు సాధించారు. వొకేషనల్ పరీక్షల్లో ఫస్టియర్లో 826 మంది పరీక్షలకు హాజరు కాగా, 516 మంది ఉత్తీర్ణత సాధించారు. 62 శాతం ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో 766 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 534 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 69 శాతం నమోదైంది.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థుల ప్రతిభ
జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరంలో 73 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ పాసయ్యారు. రెండో సంవత్సరంలో 70 మంది పరీక్షలు రాయగా 70 మంది పాసయ్యారు. వంద శాతం ఫలితాలు సాధించ డంపై ప్రిన్సిపాల్ శ్రీనాథ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు.
నిర్మల్ అర్బన్, జూన్ 28: ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదలకాగా, బాలికలే టాప్లో నిలిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో బాలురు 49 శాతం, బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో రాష్ట్రస్థాయిలో ఇంటర్ ప్రథమ ఫలితాల్లో నిర్మల్ 14వ స్థానంలో నిలిచింది, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలురు 58 శాతం, బాలికలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 15వ స్థానంలో నిలిచారు. వొకేషనల్ ప్రథమ సంవత్సరంలో బాలురు 31 శాతం, బాలికలు 53 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం వొకేషనల్ కోర్సుల్లో బాలు రు 48 శాతం, బాలికలు 70 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్ జిల్లాలోని కేజీబీవీ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 423 మంది పరీక్ష రాయగా, 395 మంది ఉత్తీర్ణులయ్యారు. 94.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అత్యధికంగా నర్సాపూర్ కేజీబీవీ కళాశాల విద్యార్థులు ఎంపీసీలో లక్ష్మి 455/470 మార్కులు, బైపీసీ విభాగంలో ఓ.శిరీష 433/440 సాధించారు. ఎంపీహెచ్డబ్ల్యూలో 485 కె.సౌజన్య మామడ, సీఈసీలో సుజాత, గాయత్రి 473 (నిర్మల్ అర్బన్ కేజీబీవీ) కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు.ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 540 మంది పరీక్ష రాయగా, 508 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 94 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఎంపీసీ విభాగంలో సాయిసింధు 957/1000 (జాం),బైపీసీలో బీ రిషిత 957/1000 (లక్ష్మణచాంద), సీఈసీలో బీ వైష్ణవి 923/1000 (మామడ), ఎంపీహెచ్డబ్ల్యూలో దేవుబాయి 940/1000 (కడెం) కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటారు.
శాంతినగర్ గురుకుల విద్యార్థుల ప్రభంజనం
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు దీటుగా మార్కులు సాధించారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో పుట్టి ధనుష్క 468/470 మార్కులు, బైపీసీలో బాసిరి జ్యోతి 436/440 సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో పెద్దగొండ అభినయ 988/1000, బైపీసీలో గోగుర్ల మహీర్తి 983/1000 మార్కులతో సత్తా చాటారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థి బీ హాసిని 430/440 మార్కులు సాధించింది.