ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో కలియదిరుగగా.. ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, మ్యానిఫెస్టో గురించి అవగాహన కల్పిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ పదేళ్లలో సర్కారు చేపట్టిన ప్రగతిని చూసి ఓటేయాలని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఒరిగేదేముండదని వివరిస్తూ చైతన్యపరిచారు. ఇక పలుచోట్ల ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరారు.