కుమ్రం భీం ఆసిఫాబాద్ : పెన్షన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. వాంకిడి మండలంలోని బంబారా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షలను జెడ్పీ చైర్ పర్సన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..57 సంవత్సరాలు నిండిన పేదలందరికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
పింఛన్ల మంజూరు నిరంతర పక్రియ అని, ఇంకా ఉన్న అర్హులకు కూడా త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సంఘాలు సంయుక్తంగా కలిసి వ్యాపారాలు పెట్టుకొని అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతాయి అని అన్నారు. కార్యక్రమంలో వాంకిడి మండల జెడ్పీటీసీ అజయ్ కుమార్, ఎంపీపీ విమల బాయి, సింగిల్ విండో చైర్ జాబొరే పెంటు , వైస్ చైర్మన్ నేపజి, తదితరులు పాల్గొన్నారు.