కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రారంభించారు. గ్రామ చరిత్రను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు. గ్రామస్తులంతా ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. మర్లవాయిలో తర్వలోనే సెల్వర్ రాబోతుందన్నారు.
అనంతరం మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ ఎస్పీని సన్మానించి హైమన్ డార్ఫ్ పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, జైనూర్ సీఐ రామకృష్ణ, జైనూర్ ఎస్ఐ మధుకర్, ఉప సర్పంచ్ జూగ్నక సావిత్రి, కార్యదర్శి మనోజ్, గులాబ్ సింగ్, గ్రామస్తులు పాల్గొన్నారు.