కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 : పిడుగుపడి ఒకరు మృతివ చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన పాలె బ్రహ్మయ్య (48) పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. గురువారం ఉదయం తన చేనులో పత్తి విత్తనాలు వేసేందుకు వెళ్లగా ఒకేసారి ఉరుములు, మెరుపులతో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనా స్థలాన్ని ఎస్ఐ రమణ్కుమార్ పరిశీలించారు. బ్రహ్మయ్య భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురి వివాహం గత నెలలో చేశారు.