కుమ్రం భీం: జిల్లాలోని జైనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని జంగావ్ ఘాట్ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.