జై నూర్, ఏప్రిల్ 29 : ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఎస్బీఐ బ్యాంక్ ఎఫ్ఐడీడీ క్రాంతి రేఖ అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో పీఎంజేజేవీవై చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు.
సంవత్సరానికి 400 రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో చెల్లించినట్లయితే కుటుంబంలో ఉన్న ప్రమాదవశాత్తుక కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగే ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్, సీఎఫ్ఎల్ సిబ్బంది పెందూర్ జంగు, కడ్తల చంద్రశేఖర్, ఆర్క వికాస్ తదితరులు పాల్గొన్నారు.