ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, నవంబర్ 28 : బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెం దేందుకు ఉద్యమించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతి బాఫూలే అని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం ఫూలే వ ర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎక్స్ రోడ్డు వద్ద ఫూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కేశవ్, మాలీ సంఘం నాయకులు శంకర్, బాపురావు, తిరుపతి తదితరులు ఉన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో..
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని ఘనంగా ని ర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునార్ రమేశ్, సంఘ సభ్యులు మారుతి, గడ్డల ప్రణయ్, అవిడపు ప్రణయ్, నాగరాజు, జావిద్, కాంగ్రెస్ పార్టీ నా యకుడు చరణ్, నాయకులు చిరంజీవి, దినాకర్, సాయిరాం, శ్యాం, ఆసిఫ్, జయరాజ్, ధర్మయ్య తదితరులు ఉన్నారు.
వాంకిడి మండలకేంద్రంలో..
వాంకిడి, నవంబర్ 28 : మండలకేంద్రంలో మాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్నులే నారాయణ్, డివిజన్ అధ్యక్షుడు గుర్నులే మెంగజి, మండలాధ్యక్షుడు వాడై బాబురావు, ప్రధాన కార్యదర్శి సెండే వాసు, సంఘం మాజీ అధ్యక్షుడు వాడై గౌరయ్య, సంఘం మండల యువజన అధ్యక్షుడు అశోక్, మైనార్టీ కోఆప్షన్ సభ్యుడు హైమద్, సింగిల్ విండో చైర్మన్ జబురే పెంటయ్య, ఆరె సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపెల్లి జైరాం, బీజేపీ మండలాధ్యక్షుడు ఆర్.శ్రవణ్ కుమార్, దివాకర్, బాపురావ్, మారుతి, కృష్ణ, వివిధ గ్రామల మాలీ సంఘం అధ్యక్షులు, గ్రామాల పటేళ్లు తదితరులు పాల్గొన్నారు.
చింతగూడ గ్రామంలో..
కాగజ్నగర్ రూరల్, నవంబర్ 28: మండలంలోని చింతగూడ గ్రామంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సిద్ధిఖీ, సర్పంచ్ ఆత్రం సంజీవ్, బాబా, మహబూబాఖాన్, ఎంపీటీసీ అస్మా ఖలీం, వైస్ ఎంపీపీ స్వదేశ్ శర్మ, మాజీ ఎంపీటీసీ నిక్యూరే నాగేందర్, అబిబ్బాయ్, నాం దేవ్, జాడి శివరాం, బాబురావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిర్పూర్(టీ) మండలంలో..
సిర్పూర్(టీ), నవంబర్ 28 : మండలకేంద్రంతో పాటు ఇటుకలపాడు, భూపాలపట్నం, తదితర గ్రామాల్లో వర్ధంతిని నిర్వహించారు. మండల మాలీ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంతంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలీ సంఘం మండలాధ్యక్షుడు గుర్నులే నానాజీ, ప్రధాన కార్యదర్శి వడాయి రవి, సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి మండలంలో..
చింతలమానేపల్లి, నవంబర్ 28: మండలకేంద్రంతో పాటు బాలాజీఅన్కోడ, డబ్బా, రుద్రాపూర్, బూరెపల్లి, గంగాపూర్ గ్రామాల్లో మాలీ కులస్తులు జెండాలు ఆవిష్కరించి నివాళులర్పించారు. జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూర్ మండలంలో..
బెజ్జూర్, నవంబర్ 28 : మండలంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాలీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతిని జరుపుకున్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ డోకె రోజా రమణి, జడ్పీటీసీ పంద్రం పుష్పలతతో కలిసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాత్రి ఏడు గంటలకు మాలీ సంఘం భవనం నుంచి ఫూలే దంపతుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. అనంతరం మాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొట్రంగి రామకృష్ణ, మండలాధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు బాబురావుతో కలిసి ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులుర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సిడాం సకారాం, కోఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఎంపీడీవో రమేశ్ రెడ్డి, నరేందర్ గౌడ్, జావీద్ అలీఖాన్, మాలీ సంఘం నాయకులు బాబురావ్, భీమన్న, మాలీ సంఘం యువత, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
కౌటాల మండలకేంద్రంలో..
కౌటాల, నవంబర్ 28: మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాలీ సంఘం నాయకులు, మహిళలు భాజా భజంత్రీలతో మండలకేంద్రానికి పెద సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు, రాష్ట్ర కార్యదర్శి ఆదె వసంత్ రావు మాలీ సంఘం నాయకులతో కలిసి మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతి బాఫూలే, అంబేద్కర్, కుమ్రం భీం, జగ్జీవన్ రాం విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కా ర్యక్రమంలో జిలా ప్రధాన కార్యదర్శి గోపాల్, రాష్ట్ర నా యకుడు నికాడే హన్మంతు, కాగజ్నగర్ డివిజన్ యూత్ అధ్య క్షుడు మోర్లె వేణు, వైస్ ఎంపీపీ నికాడే అమ్మక్క, సర్పంచ్లు ఆదె శ్రీనివాస్, రమేశ్, నిహారిక, నాయకులు ముక్తేశ్వర్, నాందే వ్, రాము, మాలీ సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
జైనూర్ మండల కేంద్రంలో..
జైనూర్, నవంబర్ 28: మండలకేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్ ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాల, సర్పంచ్లు పార్వతీ లక్ష్మణ్, మడావి భీంరావ్, నాయకులు అంబాజీరావ్, జన్నావార్ పవన్, శంకర్ తదితరులు ఉన్నారు.
గోలేటి లో ..
రెబ్బెన, నవంబర్ 28: గోలేటి గ్రామంలోని అంబేద్కర్ విగ్ర హాం వద్ద ఏర్పాటు చేసిన బౌద్ద ధమ్మ ఉపాసక్ శిబిరంలో గౌతంనగర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఫూ లే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో నాయకులు రాజేశ్వర్ దుర్గె, సికిందర్ చునార్కర్, రత్నం ప్రేమ్, తిరుపతి సోగాల, బ్రహ్మయ్య దుర్గె, శ్రీధర్ దుర్గె, సుదర్శన్ జాడె, తిరుపతి దుర్గె, సోమయ్య దుర్గ్గె, సందీప్ జాడె, లక్ష్మీనారాయణ చునార్కర్, మనోహర్ జాడె, సతీశ్కుమార్ జాడెతో పాటు పలువురు పాల్గొన్నారు.