కుమ్రం భీం ఆసిఫాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జైనూర్ మండలం రాంనగర్, పవర్ గూడ, సంబాజి గూడ, గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ క్యాంప్ ఆఫీసులో కోవ లక్ష్మి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్బండ వర్ణాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టత కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భగవంతు రావు, ఉప సర్పంచ్ సమాధాన్ డోగ్రే , ముండే సతీశ్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.