కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, సరకుల నిల్వ గదులను పరిశీలించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సందర్శించారు. అనంతరం స్వచ్ఛ గురుకుల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ఓ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.