కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని బూరగూడ గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ నుంచి భాగ్యనగర్ లింక్ బస్సు రెబ్బెన నుంచి ప్రయాణికులతో ఆసిఫాబాద్ వైపు వెళ్తున్నది.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బూరగూడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.