కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఓ నలుగురు స్నేహితులు ఈతకు వెళ్లారు. ఇద్దరు కాలువ ఒడ్డుపై కూర్చొని ఎంజాయ్ చేస్తుండగా, మరో ఇద్దరు నీటిలోకి దిగారు. వీరిద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కాగజ్నగర్ మండల పరిధిలోని నామానగర్ గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్ద చోటు చేసుకుంది.
ఈసగావ్ గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు కలిసి పెద్దవాగులోకి ఈతకెళ్లారు. శ్రవణ్(10), బిట్టు అనే ఇద్దరు ఫ్రెండ్స్ నీటిలోకి దిగి ఈత కొడుతున్నారు. తుషార్, నితీష్ అనే యువకులు ఒడ్డుపై కూర్చున్నారు. అయితే శ్రవణ్, బిట్టు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన మిగతా ఇద్దరు గట్టిగా కేకలు వేశారు. అక్కడే చేపలు పడుతున్న కొందరు.. నీటిలోకి దిగి బిట్టును ప్రాణాలతో రక్షించారు. శ్రవణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నలుగురు స్నేహితులు ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.