కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కోలాం, తోటి, పీవీటీజీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రమాదేవి, వివిధ శాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ దన్ పథకం(Jan Dhan Scheme) నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ మన్ పథకంలో భాగంగా జిల్లాలోని 149 పి.వి.టి.జి. గ్రామాల్లో చేపట్టాల్సిన పక్కా గృహాలు, రహదారులు, ఇంటర్నెట్ సేవలు, విద్యుత్, మంచినీటి సరఫరా, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, సబ్ సెంటర్ల భవనాలు, పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టడానికి అవసరమైన నివేదికలు రూపొందించి త్వరగా అందజేయాలని ఆదేశించారు. పివిటిజిల కోన్ జన్దన్ బ్యాంకు ఖాతా తెరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జనవరి 15, 2024 న లబ్ధిదారులతో ప్రధానమంత్రి మాట్లాడే కార్యక్రమం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.