వచ్చే యేడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు..
ఇప్పటికే అర్జునగుట్ట, తుమ్మిడిహట్టిని సందర్శించిన అధికారుల బృందం
ఏర్పాట్లపై ఆరా.. సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం
కోటపల్లి, అక్టోబర్ 30 : సమైక్య రాష్ట్రంలో అరకొర వసతుల మధ్య ప్రాణహిత పుష్కరాలు జరుగగా, స్వరాష్ట్రంలో తొలిసారిగా ఘనంగా నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమవుతున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు కొనసాగనుండగా, యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు ఈ నెల 26న అర్జునగుట్ట, తుమ్మిడిహట్టిని సందర్శించి స్నాన ఘట్టాలు, శార్థ మండపాలు, కేశ ఖండన కోసం స్థలాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్, మంత్రులు, వీవీఐపీలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముండగా, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రాణహిత నది… మంచిర్యాల జిల్లాను ఆనుకొని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల గుండా 109 కిలో మీట ర్లు ప్రవహిస్తున్నది. 365 రోజులు నిండుగా ప్ర వహిస్తూ జీవనదిగా ఉంది. 2010లో పుష్కరాలు వస్తే ఆనాటి నాయకులు పట్టించుకోలే దు. అప్పటి సమైక్యాంధ్ర సీఎం కిరణ్ కుమార్రెడ్డి చిన్నచూపు ఫలితంగా అంతగా ఏర్పాట్లు చేయలేదు. అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మన జిల్లాలో జరగాల్సిన పుష్కరాలను కాళేశ్వరం గోదావరి వద్ద నిర్వహించాలని నిర్ణయించారు. అక్కడ పుష్కర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా జిల్లా ప్రజలు గర్జించారు. కాళేశ్వ రం వద్ద పుష్కరాలు నిర్వహించడం ఏమిటని అప్పుడు తెలంగాణ వాదులంతా ఏకమయ్యా రు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పుష్కరాలను పొరుగు జిల్లాకు తీసుకెళ్లిన మంత్రి శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమం చేపట్టింది. అప్పటి స్థానిక ఎ మ్మెల్యే నల్లాల ఓదెలు, ప్రస్తుత ఎమ్మెల్సీ పురాణంసతీశ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన గళం వినిపించారు. నల్లాల ఓదెలు కోటపల్లి మం డలం అర్జునగుట్ట ప్రాణహిత నది ఒడ్డు వద్ద బైఠాయించగా, ప్రభుత్వం దిగి వచ్చింది. కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, కౌటా ల మండలం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత పు ష్కరాలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. సరిపడా నిధులు కేటాయించకపోవడంతో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. ప్రతిరోజూ వేలాది భక్తులు వచ్చి ప్రాణహిత నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. టీఆర్ఎస్ ఆందోళన ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిసెంబర్ 6 నుంచి 17 వరకు పుష్కరాలను నిర్వహించారు. పుష్కరాల ప్రారంభానికి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కోటపల్లి మండలం అర్జునగుట్టకు వచ్చి పుష్కరాలు ప్రారంభించేలా ఒత్తిడి తీసుకువచ్చి విజయం సాధించారు.
స్వరాష్ట్రంలో తొలిసారిగా..
వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు పుష్కరాలు నిర్వహించనున్నారు. క్రితంసారి 2010లో డిసెంబర్లో మంచిర్యాల జిల్లా కో టపల్లి మండలం అర్జునగుట్ట, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద ఈ పుష్కరాలను నిర్వహించారు. అప్పుడు ఉమ్మ డి రాష్ట్రంలో జరగ్గా.. ఈసారి స్వరాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈసారి నిర్వహించే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు ఈ నెల 26న అర్జునగుట్ట వద్ద ప్రాణహి త నదిని, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌ టాల మండలంలోని తుమ్మిడిహట్టిని సందర్శించారు. ప్రాణహిత తీరంతోపాటు స్నాన ఘ ట్టాలు, శార్థ మండపాలు, కేశ ఖండన కోసం స్థలాలను పరిశీలించారు. ప్రాణహిత పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నదని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి పుష్కరాలు జరుగుతుండడంతో సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు, వీవీఐపీలతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కావడం, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉండడం, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ సొంత మండలంలో ప్రాణహిత పుష్కరాలు జరగనుండగా, మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
2010లో సతీసమేతంగా కేసీఆర్..
ప్రాణహిత పుష్కరాల సందర్భంగా 2010లో కోటపల్లి మండలం అర్జునగుట్టకు కేసీఆర్ సతీసమేతంగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వచ్చే పుష్కరాలు స్వరాష్ట్రంలోనే జరుపుకుంటామని కేసీఆర్ చెప్పడంతో అప్పుడు ప్రజలు చప్పట్లు, ఈలలతో ఉత్సాహం నింపా రు. స్వరాష్ట్రంలో తొలిసారి ప్రాణహిత నదికి పుష్కరాలు రావడంతో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.