ఆసిఫాబాద్, ఏప్రిల్ 27: జిల్లాకేంద్రంలోని క్లేసాపూర్ హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతిని నిర్వహించారు. అర్చకుడు వొజ్జన శిరీశ్ శర్మ ఆధ్వర్యంలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ క మిటీ సభ్యులు భక్తులనే లోనికి అనుమతించారు.
కాగజ్నగర్టౌన్, ఏప్రిల్ 27 : పట్టణంలోని హనుమాన్ ఆల యం, గణేశ్, రాంమందిర్, ఈఎస్ఐ దవాఖాన ఆవరణలోని అభయ హనుమాన్, ఓల్డ్ కాలనీ, మారుతీనగర్తోపాటు పలుగ్రామాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా, భజన కార్యక్రమాలు నిర్వహించారు. న్యూ కాలనీలో గణేశ్ మందిర్లోని హనుమాన్ ఆలయంలో తహసీల్దార్ ప్రమోద్ ప్రత్యేక పూజలు చేశారు.
కౌటాల, ఏప్రిల్27: మండల కేంద్రంలోని శివాలయంలో పూ జారులు అంబేద శంకరయ్య, సంతోష్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి అభిషేకం, అర్చన, దీపారాధన, నైవేద్యం సమరించారు. అనంతరం హనుమాన్ జెండాను ఆవిష్కరించారు. భక్తులు మోహన్ రావు, ఉద్దవ్, రవి, తదితరులు ఉన్నారు.
బెజ్జూర్, ఏప్రిల్ 27 : మండలంలోని చిన్న సిద్దాపూర్లోని అభయాంజనేయ ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జెండాను ఎగురవేశారు. అన్నదానం చేశారు.
కెరమెరి, ఏప్రిల్ 27: బాబేఝరి గ్రామంలో మంగళహారతుల మధ్య ఆంజనేయ స్వామికి ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. అనంతరం భజన కీర్తనలు చేస్తూ స్వామిని ఆరాధించారు.