దస్తురాబాద్, జూలై 6 : పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీ, గిరిజ రైతుల చిరకాల కోరిక నెరవేరిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని రైతు వేదికలో గురువారం 426 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ఆమె పంపిణీ చేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు అందజేశారు. అంతకుముందు గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. అలాగే దేవునిగూడెం- రాంపూర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యేను పలువురు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శారదాశ్రీనివాస్, ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, ఎంపీటీసీలు మాన్కు, సునీతారాజలింగం, సర్పంచ్లు నిమ్మతోట రాజమణీశివయ్య, సుజాతసత్తన్న, నిరోశ, సీదర్ల భూమేశ్, భూక్యా బిల్సింగ్, అంజన్న, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీవో అనిల్ కుమార్, ఆర్ఐలు గంగన్న, పీవీ నర్సయ్య, పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య యాదవ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ మండలంలో 382 మందికి పట్టాల పంపిణీ
ఖానాపూర్ రూరల్, జూలై 6 : రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని జేకేనగర్లో 382 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు భూములు పట్టాలు కావాలని ఆదివాసీ గిరిజన రైతులు కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ వారి కోరికను నెరవేర్చారని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోహిద్, ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ఎంపీపీ వాల్సింగ్, పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, డీఆర్బీఎస్ డైరెక్టర్ కొక్కుల ప్రదీప్, ఎంపీటీసీ పుప్పాల స్వప్న, సర్పంచ్లు గంగారాం, కొడారి గోపాల్, సాగి లక్ష్మణ్రావు, నాయకులు ఆకుల వెంకగౌడ్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, రాజగంగన్న, పుప్పాల గజేందర్, శ్రీనివాస్, మధు, లవంగాల శివ, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీవో మల్లేశం, ఎంపీవో చంద్రశేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.