దస్తురాబాద్, మార్చి 25 : మహిళా సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నా రు. కడెం రైతు వేదికలో శనివారం మహిళా సం ఘాల సభ్యులకు వడ్డీ వాపస్ నిధుల చెక్కును అం దజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.82.96 లక్షల వడ్డీని ప్రభుత్వం అం దజేసిందని పేర్కొన్నారు. మహిళా సంఘాల బ లోపేతానికి, మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను మహిళలు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని, పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం వడ్డీ వాపస్ ఇవ్వడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ మ హిళా సంఘాల సభ్యులతో కలిసి సీఎం ఫ్లెక్సీకి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష- లక్ష్మణ్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యు డు రఫిక్ అహ్మద్, ఏపీఎం రాజారాం, సీబీవో ఆ డిటర్ దేవేందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొ న్నల చంద్రశేఖర్, సీసీలు స్వామి, నర్సయ్య, విఠ ల్, జ్యోతి, పద్మజ, స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.