అన్ని రంగాల్లో అభివృద్ధి, సంబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాయని, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 10 నెలల కాలంలోనే వేగంగా అభివృద్ధి పనులు చేయించారని తెలిపారు. రెవెన్యూ డివిజన్గా మారిన చండూరులో ఆర్డీఓ ఆఫీస్, కొత్త మండలంగా ఏర్పాటైన గుడిపల్లిలో తాసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. దేవరకొండ, పీఏపల్లి, మునుగోడు, నాంపల్లి మండలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించి ఫ్లోరైడ్ భూతాన్ని పారదోలిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. వెనుకబడిన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతున్నాయని తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత మునుగోడు నియోజకవర్గంలో రూ.550 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, పనిచేసే వారికే మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాజగోపాల్రెడ్డి అభివృద్ధి నిరోధకుడని, లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడిపే ఆయనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
– చండూరు/ దేవరకొండ, అక్టోబర్ 4
చండూరు, అక్టోబర్ 4 : మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, 10 నెలల కాలంలోనే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు తీయించారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చండూరులో ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పనిచేసే వారికే మళ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్నారు. అనతి కాలంలోనే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి రూ. 550 కోట్లతో మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. గత ఎమ్మెల్యే కనీసం కల్యాణలక్ష్మి చెకులను కూడా పంపిణీ చేయలేక పోతే తానే వచ్చి పంపిణీ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వంద పడకల ఆస్పత్రి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై కొందరు కుట్రలు చేస్తున్నారని వారిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. మునుగోడు నియోజకవర్గ బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టారన్నారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు త్వరలోనే పూర్తయి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తుందని, ఆ పార్టీ పాలించే రాష్ర్టాల్లో వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పెద్ద కొడుకుగా ఉంటూ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.
గత ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైందన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే అధిక నిధులు తీసుకొచ్చానని, పనులన్నీ చేపట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ నీటితో ప్రజల కాళ్లు కడిగి తన రుణం తీర్చుకుంటానన్నారు. హామీలన్నీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్ రెడ్డి సహకారంతో నెరవేరుస్తూ వచ్చానన్నారు. ధూపదీప నైవేద్యంలో భాగంగా ఇస్తున్న నిధులు రూ. 10 వేలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ బ్రాహ్మణ సంఘం నియోజవర్గ అధ్యక్షుడు చిరువెల్లి ప్రవీణ్శర్మ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు.
అనంతరం గృహలక్ష్మి లబ్ధిదారులకు అనుమతి పత్రాలు, తెలంగాణ క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గీత కార్మిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ దామోదర్ రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళా వెంకన్న, వైస్ చైర్పర్సన్ దోటి సుజాతావెంకటేశ్, ఎంపీపీలు పల్లె కళ్యాణి, స్వామి యాదవ్, శ్వేత, జడ్పీటీసీలు కర్నాటి వెంకటేశం, సురేందర్రెడ్డి, మోహ న్రెడ్డి, మారెట్ కమిటీ చైర్పర్సన్ మాధవీవెంకట్రెడ్డి, రైతు సేవ సహకార సంఘం చైర్ పర్సన్ కోడి సుష్మావెంకన్న, ఎంపీడీఓ యాకూబ్ నాయక్, తాసీల్దార్ రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు అన్నపర్తి శేఖర్, చిలుకూరి రాధికాశ్రీనివాస్, తోకల వెంకన్న, కోడి వెంకన్న నాయకులు బొమ్మరబోయిన వెంకన్న, భూతరాజు దశరథ, మధుసూదన్ రావు, అనిల్ రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన గుడిపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పాటైన గుడిపల్లి మండల కేంద్రంలో తాసీల్దార్ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టిందని, అందులో భాగంగానే కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసిందని అన్నారు.
త్వరలో మరిన్ని నిధులు కేటాయించి గుడిపల్లి మండలంలో అన్ని పరిపాలన విభాగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మట్లాడుతూ ఇప్పటికే గుడిపల్లిలో రూ. 5 కోట్ల పైగా నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని, మరికొన్ని నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీల నాయకులు మంత్రి, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. సమావేశానికి హాజరైన రెండు వేల మందికి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ముచ్చర్ల శ్రీకాంత్ భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, అదనపు కలెక్టర్ శ్రీనివాసులు, ఆరీఓ శ్రీరాములు, ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, తాసీల్దార్ శ్రీనువాసులు, సర్పంచ్ శీలం శేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, నాయకులు మునగాల అంజిరెడ్డి, ముచ్చర్ల ఏడుకొండల్యాదవ్, ఎర్ర యాదగిరి, గున్రెడ్డి జనార్దన్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చంద్రారెడ్డి, బీజేపీ నాయకుడు వట్టెపు గోవర్ధన్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.