పెద్దపల్లి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీ-ఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ను కేసీఆర్ ఆశీర్వదించారు. పెద్దపల్లి పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్రావు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు కోలేటి దామోదర్గుప్తా, చిరుమిల్ల రాకేశ్, రఘువీర్ సింగ్, ఓరుగంటి రమణారావు, గంట రాములు పాల్గొన్నారు.