నిర్మల్ అర్బన్, ఆగస్టు 12 : రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుపు మేరకు మంత్రి ఐకే రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఐకేపీ, డీఆర్డీఏ మహిళా ఉద్యోగులు, సిబ్బంది, బ్రహ్మ కుమారీలు, మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళల సమగ్ర వికాసం, సంక్షేమం, అభివృద్ధి, రక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
వారికి అడుగడుగునా పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. డయాలసిస్ బాధితులకు కూడా కొత్తగా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 15వ తేదీ నుంచి 57 ఏండ్లు దాటిన అర్హులందరికీ పింఛన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 1,50,207 మందికి పింఛన్ ఇస్తున్నట్లు, కొత్తగా ఇంకొంత మందికి ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాజేందర్, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఆయా శాఖలు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి రాఖీలు..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్కి వారి తోబుట్టువులు, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, బ్రహ్మకుమారీలు, మహిళా పోలీసులు, సిబ్బంది, మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు.
మంత్రికి సన్మానం..
జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యంతో పాటు పోలీసు శాఖకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని డీఎస్పీ అన్నారు. మైనర్ నేరస్తుల వయస్సును గుర్తించేందుకు గతంలో ఆదిలాబాద్లోని రిమ్స్ కళాశాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీంతో నేర దర్యాప్తునకు సమయం వృథా అయ్యేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాంనర్సింహా రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్, ఎస్ఐలు ఉన్నారు.
మంత్రి కృషితోనే వైద్య కళాశాల..
నిర్మల్ చైన్గేట్, ఆగస్టు 12 : మంత్రి కృషితోనే నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరైందని వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. కాగా, ఆ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్ మాట్లాడుతూ.. వైద్య కళాశాల ఏర్పాటుతో చాలా మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు పదోన్నతులు వస్తాయన్నారు. కాగా, వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అల్లోల మురళీధర్రెడ్డి, ఉద్యోగుల సంఘం జిల్లా కా ర్యదర్శి కన్నయ్య, కోశాధికారి వేణుగోపాలరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, ఉపాధ్యక్షుడు భోజారెడ్డి, మతిన్, రాష్ట్ర కౌ న్సిల్ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, ఐజే లత, నాయకులు సురేశ్రెడ్డి, మాధురి, వరలక్ష్మి, ఉమారాణి, రవి తదితరులు పాల్గొన్నారు.