నిర్మల్ టౌన్, జనవరి 5 : ఈనెల 18 నుంచి ప్రభుత్వం చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్ర మాన్ని జయప్రదం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశిం చారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో గురు వారం సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభు త్వం కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి ఈనెల 18 నుంచి ఉచితంగా పరీక్షలు నిర్వహి స్తున్నదని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో వైద్యులు, ప్రత్యేక బృందాలు ఏర్పడి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. దీన్ని వైద్యులు, ఎంపీడీవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. గురువారం సాయంత్రం కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్ ఇప్పటి వరకు పూర్తయిన పనులు, చేపడుతున్న పనుల వివ రాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచా యతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.