ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంచాయితీ ముదురుతోంది. హస్తం పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాస్రెడ్డి, బోథ్ నుంచి వన్నెల అశోక్లను అభ్యర్థులుగా ప్రకటించగా.. వీరి అభ్యర్థిత్వంపై నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండా మోసిన వారిని కాదని ఇతరులకు ఎలా టికెట్లు ఇస్తారంటూ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు కేటాయించారంటూ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ కలీంతోపాటు ఇతర మైనార్టీ నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. నేడు(సోమవారం) ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరగనుండగా.. తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీనియర్ నాయకులు తెలిపారు. టికెట్ ఆశించిన వారిలో ఒకరు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు.
– ఆదిలాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ తీవ్రరూపం దాల్చింది. రెండో విడుత జాబితాలో ఆదిలాబాద్ నియోజకవ ర్గం నుంచి కంది శ్రీనివాస్రెడ్డి, బోథ్ నుంచి వ న్నెల అశోక్కు పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిం ది. వీరి అభ్యర్థిత్వాన్ని నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానం పార్టీ జెండాను మోసిన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్ కంది శ్రీనివాస్రెడ్డికి ఇవ్వద్దంటూ నాయకులు, కార్యకర్తలు మొదటి నుంచి పార్టీ నాయకులను కోరుతున్నారు.
ఎన్ఆర్ఐగా ఉన్న శ్రీనివాస్రెడ్డి బీజేపీలో చేరారని, తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని ప్రచారం చేసుకున్నారని, అక్కడి టికెట్ నిరాకరించినందుకు కాంగ్రెస్లో చేరారని హస్తం పార్టీ నాయకులు అధిష్టానానికి సూచించా రు. కాంగ్రెస్లో ఏండ్లుగా పనిచేస్తున్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు సంజీవరెడ్డికి టికెట్లు ఇవ్వాలని కోరారు, శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బోథ్ నియోజకవర్గంలో టికెట్ విషయలో ఆ పార్టీ సీనియర్లు నరేశ్జాదవ్, ఆడే గజెందర్లు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన వారిని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఆదిలాబాద్ టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ టికెట్ను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తికి అమ్ముకున్నారని నాయకులు షేక్ కలీం ఆరోపిస్తున్నారు. మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ కలీం, ప్రధాన కార్యాదర్శి అన్వర్బాయ్, ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు రసూల్ఖాన్, వ ర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ఖాన్తోపాటు వివిధ విభాగాల నాయకులు, మండల కమిటీల అధ్యక్షులు రాజీనామా చేశారు.
ఆదిలాబాద్లో సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకోనున్నారు. ఇందులో టికెట్ అభ్యర్థి విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని చర్చించనున్నారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్రెడ్డి, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొననున్నారు. బోథ్లో టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కార్యకర్తల మనోగతాన్ని విస్మరించినందునా పార్టీ సీనియర్లలో ఒకరు పోటీలో ఉంటారని నాయకులు తెలిపారు.