శ్రీరాంపూర్, డిసెంబర్ 20 : సింగరేణి కార్మికులను ఓటు అడిగే హక్కు జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 1 గనిపై పిట్ కార్యదర్శి ఎంబడి తిరుపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్తో కలిసి సురేందర్రెడ్డి మాట్లాడారు.
సింగరేణిలో ఉద్యోగాలు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమేనని సంస్థలో పనిచేస్తున్న 20 వేల మంది యువ కార్మికులకు తెలుసన్నారు. కారుణ్యంతో నేడు సింగరేణి కళకళలాడుతుందన్నారు. యువ కార్మికులు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి టీబీజీకేఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి గడ్డం మహిపాల్రెడ్డి, అడ్డు శ్రీనివాస్, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి మహేందర్రెడ్డి, నాయకులు తిరుపతిరావు, అన్వేశ్రెడ్డి, వికాస్ తదితరులు పాల్గొన్నారు.