రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. సర్కారు స్కూళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన ఊరు మన బడితో ఆధునీకరించిన స్కూళ్ల భవనాలు, ఇతర వసతులను ప్రారంభించగా, విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, రాగిజావ పంపిణీ చేశారు. స్వరాష్ట్రంలో బడులను తీర్చిదిద్దిన తీరు, ఖర్చు చేసిన నిధులు, వసతుల కల్పనపై వివరించారు. నిర్మల్, సారంగాపూర్లలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్, బేలలో ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ , ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మంచిర్యాల జిల్లా చెన్నూర్, జైపూర్, మందమర్రి మండలాల్లో విప్ బాల్క సుమన్, మంచిర్యాల, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో ఎమ్మెల్యే దివాకర్రావు, బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో ఎమ్మెల్యే సక్కు, కాగజ్నగర్ , చింతలమానేపల్లి మండలాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయా చోట్ల జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు. ఆయా చోట్ల స్కూళ్లలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవగా.. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్లో జోగు రామన్న, మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్/బేల, జూన్ 20 : ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడ, బేల మండలంలోని సైద్పూర్ ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. అభివృద్ధి పనులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తరగతి గదుల్లో అందుబాటులోకి తెచ్చిన వసతులను పరిశీలించారు. విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని చాంద(టీ)లో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన విద్యాదినోత్సవంలో పాల్గొన్నారు.
బోథ్, జూన్ 20 : బోథ్లోని కస్తూర్బా విద్యాలయంలో రూ 2.05 కోట్లతో నిర్మించిన భవన సముదాయాన్ని ఎమ్మెల్యే రాథోడ్ రాపురావ్ ప్రారంభించారు. విద్యార్థినులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.
ఉట్నూర్/ఇంద్రవెల్లి, జూన్ 20 : ఉట్నూర్తోపాటు ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్ తండాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. స్వరాష్ట్రంలో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.
నార్నూర్, జూన్ 20 : మండలంలోని గుంజాలలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులను శాలువాతో సన్మానించారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలతోపాటు రాగిజావ అందించారు.
నిర్మల్ అర్బన్, జూన్ 20 : నిర్మల్ పట్టణంలోని రాంనగర్, సోఫీనగర్ పాఠశాలలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. రాగిజావ పంపిణీ చేశారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
బాసర, జూన్ 20 : బాసర ఆలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సరస్వతీ పూజ నిర్వహించారు.అనంతరం విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. బాసర ఆర్జీయూకేటీలో డైరెక్టర్ సతీశ్కుమార్ విద్యావిధానం, అకాడమిక్ పరంగా తీసుకున్న చర్యలు, నిర్ణయాలు, సాధించిన విజయాలు, విద్యార్థులు, అధ్యాపకులు ఉద్యోగుల పాత్ర గురించి వివరించారు. ఎన్ఆర్ఐ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ రాజశేఖర్ వంగపాటి హాజరయ్యారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 20 : మండలంలోని మస్కాపూర్, సూర్జాపూర్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు.
మంచిర్యాల అర్బన్/హాజీపూర్/దండేపల్లి, జూన్ 20 : మంచిర్యాలలోని గర్మిళ్ల ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాలల్లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే దివాకర్రావు హాజరయ్యారు. విద్యార్థులతో వసతులపై మాట్లాడారు. హాజీపూర్ మండలంలోని ముల్కల్ల, దండేపల్లి మండలంలోని పాతమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. స్వరాష్ట్రంలో స్కూళ్లలో వచ్చిన మార్పును వివరించారు.
బెల్లంపల్లి, జూన్ 20 : పట్టణంలోని నాలుగో వార్డు, నెన్నెల మండలంలోని కుశ్నపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలలో డిజిటల్ బోర్డును ప్రారంభించారు.
మందమర్రి, జూన్ 20 : మందమర్రి పట్టణంలోని దీపక్నగర్లో రూ.21.52 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విప్ బాల్క సుమన్ ప్రారంభించారు. అనంతరం మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు.
ఆసిఫాబాద్ టౌన్/వాంకిడి/రెబ్బెన, జూన్ 20 : జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఐఎఫ్టీ(ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్)ను జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్పాయితో కలిసి ప్రారంభించారు. వాంకిడి మండలంలోని చిన్న బెండార, వాంకిడి అర్జుగూడ ఎంపీపీఎస్ పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
లింగాపూర్, జూన్ 20 : మండలంలోని జాముల్ధార, కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు.
కాగజ్నగర్ టౌన్/చింతలమానేపల్లి, జూన్ 20 : కాగజ్నగర్ పట్టణంలోని వార్డు నంబర్ 3,7,10, నజ్రూల్నగర్, చింతగూడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చింతగూడ, నజ్రూల్నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో కుమ్రం భీం జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో పాల్గొన్నారు. చింతలమానేపల్లి మండలంలోని గూడెం, కర్జెల్లి గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన పాఠశాలలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కోనప్ప ప్రారంభించారు.