భైంసా, నవంబర్ 15 : నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధ్దిని చూసి ఈ ఎన్నికల్లోను తనను ఆదరించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి కోరారు. మంగళవా రం రాత్రి భైంసాలోని సంజీవ్ రెడ్డి ఫ్యాక్టరీలో పలువురు ముస్లిం యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వారికి విఠల్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సుమారు 50 మంది వరకు యువకులు బీఆర్ఎస్లో చేరారు. నాయకులు పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, విలాస్ గాదే వార్ తదితరులు పాల్గొన్నారు.
కుభీర్, నవంబర్ 15 : మండల కేంద్రానికి చెందిన 150 మంది బీజేపీకి చెందిన మహిళలు, యువకులు, నాయకులు మంగళవారం రాత్రి భైంసాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. వారందరికి ఆయన గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బొప్ప గణేశ్, పోగుల లింగన్న, శేరి భూమన్న, ధన్గరి భూమన్న, బొప్ప నాగబాయి, రమాబాయి, తాండ్ర అంజు, ఫేరోజ్ఖాన్, దొంతుల గణేశ్, యువకులు పార్టీలో చేరారు.
అలాగే నిగ్వ, పాంగర్పాడ్, మౌలా, ఓల్డ్ సాంవ్లి, లింగి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయ కులు ఇంటింటా ప్రచారం చేశారు. ఆయా చోట్ల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నీల అనిల్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మొహియుద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగా చరణ్, మార్కెట్ చైర్మన్ కందూర్ సంతోష్, శంకర్ చౌహాన్, బొప్ప నాగ లింగం బీ పెంటాజీ, మహిపాల్ రెడ్డి, దిగంబర్ పటేల్, బాపురావు, నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రెవార్ పలు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.
భైంసా, నవంబర్ 15 : భైంసాలోని పలు ఏరియాల్లో బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, సీనియర్ నాయకులు మురళీ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి తోట రాము, సూరి, భోజా రాం, గంగారాం,ఉషనొళ్ల రెడ్డి ఉన్నారు.
భైంసాటౌన్, నవంబర్ 15 : మండలంలోని కుంబి గ్రామంలో మండల బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా మాజీ జడ్పీటీసీ సూర్యం రెడ్డి, నాయకులు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
తానూర్, నవంబర్, 15 : మండల కేంద్రంలో బుధవారం ఇంటింటికీ తిరుగుతూ విఠల్రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు కానుగంటి పోతారెడ్డి మాట్లాడుతూ ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు తాడేవార్ విఠల్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, చంద్రకాంత్యాదవ్, కోఆప్షన్ సభ్యుడు గోవింద్పటేల్, ఉప సర్పంచ్ నయూమ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముథోల్, నవంబర్ 15 : మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ఖాన్ ఆధ్వ ర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభు త్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకూ అందుతున్నాయని నాయకులు పేర్కొ న్నారు. ప్రజలు, ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసి విఠల్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ముథోల్ మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, విశ్వంబర్, కేర్బా, గంగాధర్ పటేల్ తదితరులు ఉన్నారు.
లోకేశ్వరం, నవంబర్ 15 : గఢ్చాంద గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకూ ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్పందన చూస్తే ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్నారు. కిరణ్ కొమ్రెవార్, ఎంపీపీ లలితా భోజన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపె శ్యాంసుందర్, సింగిల్ విండో చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచ్ వెంకట్ రావు, నాయకులు కపిల్, సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్యాట సుధాకర్, బండి ప్రశాంత్ పాల్గొన్నారు.