ఎదులాపురం, ఏప్రిల్ 19 : ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10ః30 గంటలకు జిల్లా కేంద్రంలోని సాత్నాల క్వార్టర్స్ ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని అపోలో ఫార్మసీలో ఉద్యోగావకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11వేల నుంచి రూ.20వేల వరుకు వేతనం ఉంటుందని వివరించారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మాసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 8247656356 నంబర్ను సంప్రదించాలని సూచించారు.