కాగజ్నగర్/మంచిర్యాల అర్బన్, జనవరి 19 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు.
ఉదయం 10 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని, 10.45 గంటలకు అనుమతిస్తారని ఆయన పేర్కొన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యా హ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఆధార్ కార్డు, ఏదైనా ధ్రువీకరణ పత్రం తప్పనిపరిగా తీసుకురావాలని సూచించారు.
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 4458 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి 983 మంది విద్యార్థులకు 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి 1208 మంది దరఖాస్తు చేసుకోగా, 6 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
మంచిర్యాల జిల్లా నుంచి 1188 మంది విద్యార్థులకు, 7 పరీక్షా కేంద్రాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 1079 మందికి 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కాగా, విద్యార్థులు జవహర్ నవోదయ అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాద య్య తెలిపారు.