చెన్నూర్ రూరల్, ఆగస్టు 30 : మండలంలోని లంబాడీపల్లి గ్రామంలో ఎంపీటీసీ నగావత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పింఛన్దారులంతా బాల్క సుమన్కే ఓటు వేసి గెలిపించుకుంటామని బుధవారం తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పింఛన్ అంటే రూ.200 మాత్రమే తెలుసని, అవి కూడా ఎప్పడు వచ్చేవో కూడా తెలిసేది కాదని అన్నారు. కానీ తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయిన తర్వాత వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఏకంగా రూ.2016, దివ్యాంగులకు రూ.3016 చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు దివ్యాంగులకు మరో రూ.వెయ్యి పెంచి రూ.4016 చేశాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని అభివృదిధ, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నామని తెలిపారు. విప్ సుమన్ వల్లే చెన్నూర్ రూపురేఖలు మారాయని అన్నారు. గతంలో లంబాడీపల్లి గ్రామానికి రోడ్డు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఆయన కృషితో ఆ బాధ తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంత అభివృద్ధి చేసిన బాల్క సుమన్కే మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసినట్లు వారు స్పష్టం చేశారు. అనంతరం దివ్యాంగులకు అదనంగా పెరిగిన రూ.వెయ్యి పింఛన్ ప్రొసీడింగ్తో డబ్బు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలోత్ లక్ష్మీప్రియ, పంచాయతీ కార్యదర్శి పద్మ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్, ఆగస్టు 30 : మండలంలోని నర్సింగాపూర్ (ఎస్) గ్రామస్తులు బీఆర్ఎస్కే ఓటు వేసి, విప్ సుమన్ను గెలిపించుకుంటామని తీ ర్మానం చేసుకున్నారు. పంచాయతీ కార్యాల యం వద్ద సమావేశమయ్యారు. విప్ బాల్క సు మన్ సారథ్యంలో నియోజకవర్గం అన్ని రంగా ల్లో అభివృద్ధి పథంలో నడుస్తున్నదని, మరోసా రి ఆయనకు అండగా ఉంటామని తేల్చి చెప్పా రు. తీర్మానం కాపీని స్థానిక ప్రజాప్రతినిధులకు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పండుగ బుచ్చమ్మ, ఎంపీటీసీ బోయిన స్వాతి, నాయకులు రాజన్న, సంపత్ పాల్గొన్నారు.