ఎదులాపురం, డిసెంబర్ 4 : కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు చేస్తున్న అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని, ఇందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను సిద్ధంగా ఉన్నానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్కు సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ధోబీకాలనీ(సరస్వతీ నగర్)లో ఎస్డీఎఫ్ నిధులు రూ.5 లక్షలతో నవచైతన్య యూత్ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. అక్కడే ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడా రు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా కీలకమన్నారు. అభివృద్ధి ఎవరు చేశారో వాస్తవాలపై డిబేట్ జరగాలన్నారు. రాజకీయంగా చాలా మా ట్లాడతామని, స్వరాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్ప టి వరకు జరుగుతున్న అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనేనని గౌరవంగా చెబుతామన్నారు.
తెలంగా ణ సాధించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కేం ద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చ కు సిద్ధమా? అని బీజేపీ ఎంపీకి సవాల్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గతంలో లేని విధంగా యువత భవిష్యత్కు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండాప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్ను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ భరత్ కుమార్, టీఆర్ఎస్ కార్యదర్శి అష్రఫ్, టౌన్ ఉపాధ్యక్షుడు దివిటి రాజు, మహిళా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వరూప, బోడగం మమత, కో ఆప్షన్ సభ్యుడు ఎజాజ్, నాయకులు రాంకుమార్, నారాయణ, యోగేశ్ పాల్గొన్నారు.
అన్నాబావుసాఠే చిత్రపటం అందజేత
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు అన్నాబావు సాఠే చిత్రపటాన్ని ఆ అసోసియేషన్ సభ్యు లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. పట్టణ సుందరీకరణలో భాగంగా అన్నాబావు సాఠే చౌక్ సుందరీకరణ పనులు ప్రారంభించినందుగాను సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు చిత్రపటం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి డీకే నాందేవ్, ఉపాధ్యక్షుడు భట్లాడే సూర్యకాంత్, కోశాధికారి జివాలే మాధవ్, కినార్ పల్లి సర్పంచ్ సచిన్ సాగురే, నాయకులు అర్జున్, సూర్యకాంత్, కాంబ్లే లక్ష్మణ్, మారుతి, సంబాజీ పాల్గొన్నారు.
యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి
యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముం దుండాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలో చలి తీవ్రత దృష్ట్యా అమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలో స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై వృ ద్ధులకు స్వెటర్లు అందించారు. వారి యోగక్షేమా లు అడిగి తెలుసుకున్నారు. ఆమాన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్ అంజు, అమాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు అర్ఫత్ తదితరులు పాల్గొన్నారు.