ఆసిఫాబాద్టౌన్, మార్చి 8 : అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాలు, గురుకులాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహి ళా ఉద్యోగులను శాల్వలతో సత్కరించి సన్మాణించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్జి యువరాజు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసీయేషన్ అధ్యక్షుడు సతీశ్బాబు, న్యాయవాదులు రాజీవ్ రెడ్డి, రాపర్తీ రవి, ఆయా కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, మార్చి 8 : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్షిప్లో గల సీఈఆర్ క్లబ్ లో శుక్రవారం సింగరేణి సేవా సమితి బెల్లంపల్లి ఏరియా ఆధ్వర్యంలో ఏరియా జీఎం రవిప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ ఏరియా అసుపత్రి ఏసీఎంవో ఉషారాణి, బెల్లంపల్లి ఏరియా సేవా సమితి ఉపాధ్యక్షురాలు నళినినరేందర్, ఏరియా ఎస్వోటూజీఎం మచ్చగిరి నరేందర్, ఏఐటీయుసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, డీజీఎం(సివిల్) సతీశ్బాబు, సీనీయర్ పీవో ప్రశాంత్, సీనీయర్ సేవా సమితి సభ్యులు సోల్లు లక్ష్మి తదితరులు ఉన్నారు.