మండల కేంద్రంలోని ముథోల్లోని గుట్ట గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి.వేద పండితుల
భారీగా హాజరైన భక్తులు
గుట్ట గణపతికి ప్రముఖుల పూజలు
ముథోల్, ఫిబ్రవరి 12 : మండల కేంద్రంలోని ముథోల్లోని గుట్ట గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య గుట్ట గణపతి దేవాలయ యంత్ర స్థిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్వర్యంలో నిర్మించిన గుట్ట గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
మహిళలు హారతులతో తరలివచ్చి పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు రామరావు పటేల్, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘం సభ్యులు పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్న ప్రసాద పంపిణీ చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో గుట్ట గణపతి ఆలయ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఇబ్బందు లు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
విఠలేశ్వర ఆలయంలో..
భైంసా, ఫిబ్రవరి 12 : కుంటాల మండలం ఓలాలో విఠలేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాప న మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని గందె పరివార ఆధ్వర్యంలో నిర్మించ గా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలను నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ముందుగా విగ్రహ ప్రతిష్ఠాపన, విగ్రహ ఊరేగింపు నిర్వహిం చారు. మహిళలు మంగళహారతులతో శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో పూజలు, యజ్ఞం తదితర కార్యక్రమాలు నిర్వ హించారు. మాజీ సర్పంచ్ గందె ప్రవీణ్, సభ్యులు, రాజ్కుమార్, శివకుమార్, పూజారి భగవాన్ రావు తదితరులు పాల్గొన్నారు.