ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 13 : ‘మనఊరు-మనబడి’ పనులు వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టీ), మ న్నూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, రేషన్ షాపులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలల్లో సుందరీకరణ, మొక్కల పెంపకం, తదితర పనులను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పనులను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు, సర్పంచ్లు, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని, పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూ డాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం పెట్టాలని ఆదేశించారు. ఫర్నీచర్ సరఫరా వివరాలను ఆయా పాఠశాలల హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఎంపిక చేసిన మాడల్ స్కూల్స్ ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రేషన్ షాపులను పౌర సరఫరాల అధికారులతో కలిసి తనిఖీ చేశా రు. లబ్ధిదారులకు సకాలంలో బియ్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి నారాయణ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సర్పంచ్లు పాల్గొన్నారు.