మామడ, అక్టోబర్ 18: సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కమల్కోట్, జమ్లానాయక్ తండాలకు చెందిన 70 మంది యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే అగ్రగామిగా నిలిచాయని చెప్పారు. పార్టీ గెలుపు కోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని సూచించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్రావు, సర్పంచ్ రావుల ముత్యంరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, నాయకులు నల్ల లింగారెడ్డి, రమేశ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, నర్సారెడ్డి, సంతోష్, లక్ష్మీ నారాయణ, మహేందర్ తదితరులున్నారు.