కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీట్ల లొల్లి మొదలైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. టికెట్ ‘కంది’కి ఇవ్వొద్దంటూ ప్రత్యర్థి వర్గం హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్నవారిని కాదని, ఆయనకు ఇస్తే గెలిపించబోమని స్పష్టం చేసింది. ఇక ఇరువర్గాలు ఎవరికి వారే టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, వీరి మధ్య గ్రూపు తగాదాలతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
-ఆదిలాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, అక్టోబర్ 7 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. డీసీసీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, మరో నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి మధ్య కొన్ని రోజులుగా వర్గపోరు జరుగు తుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో డీసీసీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్రెడ్డి పార్టీ టికెట్ను ఆశిస్తున్నారు. వీరితో పాటు కంది శ్రీనివాస్ రెడ్డి సైతం టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. అయితే కంది శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉన్నాడని, చాలారోజులు బీజేపీలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కాంగ్రెస్లో చేరాడని శ్రేణులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వదంటూ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆదిలాబాద్లో జరిగిన సమావేశంలో ఇరు వర్గాల మధ్య గొడవ కూడా జరిగింది. పార్టీ పిలుపు నిర్వహించే కార్యక్రమాలను ఇరువర్గాలు వేర్వేరుగా చేస్తున్నారు.
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ పంచాయతీ హైదరాబాద్లోని గాంధీ భవన్కు చేరింది. కంది శ్రీనివాస్రెడ్డికి ఇవ్వద్దంటూ ని యోజకవర్గానికి చెందిన కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్కు బయదేరారు. గాంధీభవన్ ఎదుట ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. 15 సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తున్నవారిని కాదని ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ప్యారాచ్యూట్ నాయకుడు కంది శ్రీనివాస్రెడ్డికి టి కెట్ ఇవ్వద్దన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే పనిచేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఆదిలాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తిని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓడిపోతుందని డీసీసీ అధ్యక్షుడు తెలిపారు. పార్టీ జెండా మోసిన వారిని అధిష్టానం గుర్తించాలన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరుతో తీవ్రంగా మారడంతో కార్యకర్తల్లో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది.