భైంసా, అక్టోబర్, 25 : భైంసా లో బుధవారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకలు కనుల పండువగా సాగాయి. విశ్రాంతి భవనం ముందు, పురాణాబజార్లో గల గౌలీ సంఘం దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. యువకుల నృత్యాలు, కోలాటాలు, పోతరాజుల విన్యాసాల మధ్య శోభాయాత్ర సాగింది. పట్టణ సమీపంలో గల గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దుర్గామాత ప్రతిమ లను నిమజ్జనం చేశారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు ప్రాజెక్టు వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.
పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశా రు. ఎస్పీతో పాటు ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గు రు డీఎస్పీలు సీఐలు 15, ఎస్ఐలు 27, ఇతర పోలీసులు 400 మంది బందోబస్తులో పాల్గొ న్నా రు. యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకు న్నా యి. ఆయా రూపాల్లో ఉన్న దుర్గామాతలను పట్టణ వాసులు పూజలు జరిపారు. శోభాయాత్ర దృశ్యాలను మహిళలు, చిన్నారులు డాబాలపై నుంచి తిలకించారు. భట్టిగల్లీలో తూమోల్ల దత్తాత్రి, తిరుమల హర్డ్వేర్ వెంకటేశ్, గొల్ల కుర్మ ఆధ్వర్యంలో ప్రసాదాల వితరణ చేపట్టారు. నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న పలువురికి నీటితో పాటు పులిహోర ప్యాకెట్లను అందజేశారు.