మంచిర్యాల, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆయన భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వానికి.. డెవలపర్స్కు మధ్య వారధిగా ఉండి పని చేయాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమాలకు తెరలేపాడు. భీమారం మండల కేంద్రంతో పాటు పక్కనున్న పొలంపల్లి గ్రామంలో అక్రమ వెం చర్లు వేసి ప్లాట్లు అమ్మేస్తున్నాడు. నిబంధనల ప్రకారం డీటీసీపీకి వెళ్తే తప్ప ప్లాట్లు అమ్మడానికి వీలుపడదు. కానీ, ఈ వెంచర్లకు ఎలాంటి పర్మిషన్లు లేవు. డీటీసీపీ తీసుకోకుండా వెంచర్ ఎందుకు చేస్తున్నారంటూ అడగడానికి వెళ్తే ‘ఏం జరిగినా నేను చూసుకుంటా..
ఏ ఉన్నతాధికారి నన్ను ఏం చేయలేడు.. నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసు కదా.. అవసరమైతే ఎమ్మెల్యేతో చెప్పిస్తా’ అని దబాయిస్తు న్నాడని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. నిబంధనల ప్రకారం డీటీసీపీకి వెళ్లండంటే.. పక్కనున్న జైపూర్ మండలంలో వందల ఎకరాలు అక్రమంగా ప్లాట్లు చేసి అమ్మేస్తున్నరు. నా సొంత మండలంలో ఎందుకు చేయరంటూ రివర్స్ మాట్లాడుతున్నారని.. ఎమ్మెల్యే పేరు చెబుతుండడంతో ఏం చేయాలో తెలియక మిన్నకుండి పోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇలా క్షేత్రస్థాయి అధికారులను కీలు బొమ్మలు చేసి ఆడిస్తూ.. సర్కారు ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నాడు.
డీటీసీపీ లే-అవుట్కి పోకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. కానీ ఇక్కడే అక్రమాల చంద్రుడు తన తెలిపితేటలను ప్రదర్శించాడు. భీమారం మండల కేంద్రంలోని పెట్రో ల్ బంక్ వెనుకాల సర్వే నంబర్లోని 634 ఐదు ఎకరాల్లో ప్లాటింగ్ చేశాడు. దాదాపు 79 ప్లాట్లకు 20 ఫీట్ల రోడ్లు పోసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాడు. హైవే పక్కనే ఉన్న భూ మి కావడంతో మార్కెటింగ్కు కూడా ఇబ్బందుల్లేకుండా పోయాయి. కానీ డీటీసీపీ లేకుం డా రిజిస్ట్రేషన్ చేయరని, ఐదు ఎకరాల్లో ఒక ఎకరం నాలా కన్వర్షన్ చేయించాడు.
దీంతో వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారింది. నాలా కన్వర్షన్ చేయడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేయడం సులభమైంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొందరు అధికారులకు ముడుపులిచ్చి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించాడు. అలా 79 ప్లాట్లలో 30కి పైగా ప్లాట్లను ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు సైతం చేయించినట్లు తెలుస్తున్నది. నాలా కన్వర్షన్ చేయించడంతో టెక్నికల్గా ఎలాంటి అనుమానాలు రాలేదని, అందుకే రిజిస్ట్రేషన్ చేశామంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారు లు చెబుతున్నారు.
ఇలా ఉన్న చిన్నపాటి లూప్హోల్ను అడ్డంపెట్టుకొని అధికారులనే బురిడి కొట్టించి దందా చేస్తున్నాడు. భీమారం మండల కేంద్రంతో పాటు పక్కనున్న పొలంపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 20లో మూడు ఎకరాల 13 గుంటల్లో ఇల్లీగల్ వెంచర్ను ఏర్పాటు చేశాడు. దాదాపు ఇందులో 42 ప్లాట్లను ఏర్పాటు చేశాడు. అనుమతులు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులు వెళ్లినప్పుడు ఇక్కడ కూడా నేను చూసుకుంటా అంటూ స్పష్టం చేశాడు.
గ్రామ పంచాయతీకి ఇక్కడ కొంత స్థలం కూడా ఇస్తానని డెవలప్మెంట్ కింద చూపించుకోండంటూ గ్రామస్తులు, అధికారులకు కల్లిబొల్లి కబుర్లు చెప్పాడు. ప్లాటింగ్వేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.. రేపో, మాపో రిజిస్ట్రేషన్లు చేసేందుకు సైతం సిద్ధం అవుతున్నాడు. మరి ఇప్పటికైనా అక్రమాల చంద్రుడి పై జిల్లా ఉన్నతాధికారుల కన్ను పడుతుందా.. లేదా ఆయనకున్న పలుకుబడిని చూసి అధికారులు సైతం మిన్నకుండి పోతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఇల్లీగల్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసి మేము వెళ్లి నోటీసులు ఇచ్చాం. పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి అన్ని అనుమతులు తీసుకోవాలని, లేని పక్షంలో మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. కానీ ఆయన మాతో పక్కనున్న జైపూర్ మండలంలో వందల ఎకరాల ఇల్లీగల్ వెంచర్లు చేస్తున్నారు. మన మండలంలో ఎందుకు చేయకూడదు. అవసరమైతే నేను ఎమ్మెల్యేతో ఉన్నతాధికారులు చెప్పిస్తా. ఎవ్వరితోనూ ఇబ్బందులు ఉండవని చెబుతున్నాడు. ఈ లేఅవుైట్లెతే చట్ట విరుద్ధంగానే ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు ఆదేశిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.