బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో అమలు చేసిన పథకాలతో పాటు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో శుక్రవారం అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, విఠల్రెడ్డి, అనిల్ జాదవ్, జాన్సన్ నాయక్ ప్రచారం నిర్వహించారు. గ్రామల్లో ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీలు, ఘన సన్మానాలతో హోరెత్తించారు. పలు పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇచ్చోడ(సిరికొండ), అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓటు వేసి తనను గెలిపించాలని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు సిరికొండ మండలకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బోథ్ బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ జాదవ్కు కార్యకర్తలు పొన్న ఎక్స్ రోడ్డు నుంచి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం అనిల్ జాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించాలన్నారు. భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే సిరికొండ మండలంలో ఉన్న ప్రధాన సమస్య చిక్మన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.
అలాగే ఖానాపూర్ బీఆర్ఎస్ భూక్యా జాన్సన్ నాయక్కి పూర్తి మద్దతు ఇచ్చి మెజార్టీతో గెలిపించాలన్నారు. అదేవిధంగా సిరికొండ మండలానికి చెందిన చంటి భూమన్నతో పాటు 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ నగేశ్, అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్మల పెంటన్న, ఉప సర్పంచ్ తోకల చందు, ఎంపీటీసీ పర్వీన్, సుంకిడి సర్పంచ్ రోహిదాస్, సోన్పల్లి సర్పంచ్ సూర్యకాంత్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండీ ఇక్బాల్, గ్రామ రైతుబంధు సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి, ఇచ్చోడ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాండురంగ్, మండల మాజీ కన్వీనర్ మేరాజ్, మాజీ జడ్పీటీసీ కృష్ణకుమార్, ఉప సర్పంచ్ శిరీశ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు శివ రెడ్డి, గాడ్గె సుభాష్, వెంకటేశ్, మహిళా నాయకురాలు సోంబాయి శాబీర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు జింక లక్ష్మణ్ పాల్గొన్నారు.