కాగజ్నగర్ రూరల్, నవంబర్ 30 : మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయంలో షష్ఠి బోనాలు కొనసాగుతున్నాయి. బుధవారం దూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. బోనాన్ని వండి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.
తాండూర్లో
తాండూర్, నవంబర్ 30 : మండలంలోని రేచిని (నగరం) కుంకుమయి మల్లన్న ఆలయంలో బోనాల సందడి నెలకొన్నది. భక్తులు కుటుంబసభ్యులతో కలిసి ఉదయాన్నే ఆలయానికి చేరుకుని ప్రాంగణంలో బోనం చేశారు. మల్లన్న స్వామికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సామూహిక భోజనాలు చేశా రు. బుగ్గ దేవస్థానం చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు కుటుంబ సమేతంగా హాజరై బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రేచిని, గోపాల్నగర్ గ్రామపంచాయతీ వారు ఏర్పాట్లు చేశారు.
నెన్నెల మండలంలో..
నెన్నెల,నవంబర్30 : మండలంలోని నందులపల్లి రావుల మల్లన్న, మైలారం మల్లన్న ఆల యం వద్ద బోనాల సందడి నెలకొన్నది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు వండి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు అన్నదానం, పట్నాలు వేశారు.