భారతదేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని, తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణ శివారుల్లో పదెకరాల్లో రూ.5.35 కోట్లతో నిర్మించిన ఈద్గాను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అభివృద్ధి పర్చిన విధంగా.. దేశాన్ని కూడా ప్రగతి పథంలో దూసుకెళ్లే విధంగా చేయడానికే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
– నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 18
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 18: దేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలుస్తున్నారని, తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ శివారులోని రూ.5.35 కోట్లతో నిర్మించిన ఈద్గాను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ముందుగా నిర్మల్కు చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ సోఫీనగర్లోని మసీదును సందర్శించారు. అనంతరం విశ్రాంతి భవనంలో హోంమంత్రికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్ పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈద్గాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. దేశంలో నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలిచారని కొనియాడారు. నిర్మల్లో పదెకరాల్లో నిర్మించిన ఈద్గా హైదరాబాద్లో కూడా లేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నారో దేశాన్ని కూడా అదే తరహాలో ముందుకె తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఆర్డీవో స్రవంతి, కౌన్సిలర్లు, మసీదు కమిటీ బాధ్యులు, బీఆర్ఎస్, మైనార్టీ నాయకులు ఉన్నారు.
రూ. 5 లక్షల చెక్కు అందజేత
పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 5 లక్షల చెక్కును మహమూద్ అలీ ఫారెస్ట్ అతిథి గృహంలో ఎస్పీ ప్రవీణ్కుమార్కు అందజేశారు.