నెన్నెల, జనవరి 11 : రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మైలారం ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గంట వైష్ణవి ఎంపికైనట్లు హెచ్ఎం పీ చంద్రశేఖర్ రెడ్డి, పీఈటీ సాంబమూర్తి గురువారం తెలిపారు.
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 10న శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించిన అండర్- 14 జోనల్ స్థాయి కబడ్డీ పోటీల్లో బాలికల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జనగామలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వైష్ణవి పాల్గొంటుందని పేర్కొన్నారు. విద్యార్థినిని పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ తాడూరి భాస్కర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు.