ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతున్నది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. బజార్హత్నూర్లో 12.04 సెంటీమీటర్లు, తాంసిలో 11.28 సెం.మీ., ఆదిలాబాద్లో 10.26 సెంటీమీటర్ల వర్షం కురింది. ఉమ్మడి జిల్లాలో భారీగా వర్షం కురవడంతో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో కడెం జలాశయానికి 15,680 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. 18,244 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 696.175 అడుగుల మేర నీరు ఉన్నది.