ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో దీక్షగా చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధ మవుతున్న దివ్యాంగ యువకుడు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన చిన్న రైతు కుటుంబీకుడు. నాన్న కొన్నేళ్ల క్రితం మృతిచెందగా అమ్మ, తమ్ముడు వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం వీరి ఐదెకరాల భూమికి ఏడాదికి రూ.50 వేలు రైతుబంధు ఇస్తుండగా అవి పెట్టుబడికి సరిపోతున్నాయి. దిగంబర్ పట్టుదలతో సర్కారు బడి, కళాశాలలోనే డిగ్రీ, బీఎడ్ పూర్తి చేశాడు. నెలనెలా వస్తున్న రూ.4,016 దివ్యాంగ పింఛన్తో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాడు. మిత్రులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గది అద్దెకు తీసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయంలో చదువుకుంటున్నాడు. రవాణా, ఇతర ఖర్చులకు కుటుంబీకులను ఇబ్బంది పెట్టే అవసరం రావడం లేదు. ఇతను టెట్ ఉత్తీర్ణత సాధించి.. డీఎస్సీ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
– అలికె దిగంబర్, అంతర్గాం, దివ్యాంగ పింఛన్దారు, భీంపూర్
ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. వృద్ధాప్యంతోపాటు ఇతర కారణాలతో బాధపడుతున్న అభాగ్యులకు ప్రభుత్వం చేయూత అందిస్తున్నది. ఇప్పటికే వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత వంటి కార్మికులకు నెలకు రూ.2,016 ఇస్తుండగా.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం రూ.3,016 ఇచ్చి, రానున్న ఐదేళ్లలో యేడాదికి రూ.500 పెంచుకుంటూ రూ.5,016 చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా రూ.4,016 పింఛన్ ఇస్తుండగా.. రానున్న ఐదేండ్లలో రూ.6 వేలు చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో మాపై మరోసారి కేసీఆర్ ప్రేమను చాటారని, వారు తీసుకున్న నిర్ణయం మా జీవితాల్లో భరోసా నింపిందని వృద్ధులు, దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇవ్వని వారు తెలంగాణలో ఎలా ఇస్తారని, వారిని నమ్మమని పేర్కొంటున్నారు.
– మంచిర్యాల, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
లోకేశ్వరం, ఆగస్టు 19 : పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం రాగానే తొలుత ఆసరా పెన్షన్ పెంచనున్నట్లు కేసీఆర్ తెలపడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు మహిళలకు పెద్దన్నలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఆసరా పెన్షన్ పెంచడంపై రుణపడి ఉంటా.
– జాదవ్ స్వప్న, రాయపూర్ కాండ్లి
సోన్, అక్టోబర్ 19 ః ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.200 ఉన్న పెన్షన్ను రూ.2,016కు పెంచి మాలాంటి గరీబోళ్లను ఆదుకుంటున్నడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ మరో వెయ్యి పెంచి రూ.3,016 చేయనున్నట్లు చెప్పడంతో సంతోషం కలిగింది. యేటా రూ. 500 పెంచుతూ రూ.5 వేల వరకు చేస్తాననడంతో మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లయింది.
– జంబుగ హంస, సోన్
కాసిపేట, అక్టోబర్ 19 : తెలంగాణ రాకముందు పింఛన్ రూ. 200లే ఇచ్చేటోళ్లు. గా పైసలు కూడా ఎప్పుడచ్చేవో తెలిసేది కాదు. మస్తు తిప్పలపడేటోళ్లు. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక పింఛన్ను మస్తు పెంచిండు. ముసలోళ్లను కడుపుల పెట్టుకొని చూస్కుంటున్నడు. గిసొంటి సీఎం మాకు ఎప్పటికీ కావాలె.. ఇంకెవ్వరినీ దగ్గరికి కూడా రానీయం.
– బద్ది కిష్టమ్మ, కాసిపేట
కాసిపేట, అక్టోబర్ 19 : సీఎం కేసీఆర్ మాకు పెద్ద కొడుకోలె అయ్యిండు. పింఛన్తో మమ్ముల ఆదుకుంటున్నడు. మళ్లా అధికారంలోకి వస్తే పింఛన్ను రూ. 5016 చేస్తమని చెప్పిండు. ఇంత మంచి మాట చెప్పినందుకు సంతోషంగా ఉంది. ఎలాగైనా మళ్లా కేసీఆరే గెలుస్తడు. ఆయన మాట ఇస్తే అంతే.. కచ్చితంగా చేసి తీరుతడు. గిసొంటి సర్కారు ఉన్నంత కాలం పేదలకు మేలైతది.
– కొండ రాజమ్మ, కాసిపేట
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లుగీత కార్మికులు పింఛన్పైనే ఆధారపడి బతుకుతున్నరు. ఇలాంటి వారి కోసం బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.5 వేలు, దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్ను రూ.6 వేలకు పెంచామని మ్యానిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3,016 చేసి రానున్న ఐదేళ్లలో ఏడాదికి రూ.500 పెంచుకుంటూ రూ.5,016 చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో.. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్రాల్లో కేవలం రూ.1000 పింఛన్ ఇస్తుంటే ఒక్క తెలంగాణలోనే రూ.2,016 ఇస్తుండడం గొప్ప విషయం అంటున్నారు. రూ.2,016 ఇచ్చేది కేసీఆరేనని, అధికారంలోకి వస్తే కచ్చితంగా రూ.5 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉచితాలు ఎందుకు అని ప్రశ్నించేటోళ్లు ఒక్కసారి ఆ పింఛన్నే నమ్ముకొని బతుకుతున్న వారిని చూడాలంటున్నారు.
– మంచిర్యాల, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇచ్చోడ, అక్టోబర్ 19 : నా అసోంటి ముసలివాళ్లు వయసు పెరగడంతో ఎటువంటి పనిచేయకుంట ఇంటికాడ ఉండడంతోపాటు వృద్ధాప్యంలో వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి మెడికల్ ఖర్చు బాగా అవుతున్నది. గత ప్రభుత్వాలు తక్కువ పింఛన్లు అందించాయి. ఇవి ఎటు సరిపోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.2,016 నుంచి దశలవారీగా రూ.5,016 పెంచుతామని ప్రకటించడం సంతోషం. మా సోంటి ముసలివాళ్లకు ఆర్థిక భారం తగ్గుతది.
– బొడ్డు రాములు, వృద్ధుడు, సిరికొండ
గుడిహత్నూర్, అక్టోబర్ 19 : తెలంగాణ వృద్ధులకు కేసీఆర్ దేవుడులాంటివాడు. మేము బతికున్న రోజులు మరచిపోలేం. రూ.200 నుంచి పింఛన్ ఇచ్చేవారు. ఆ డబ్బులు సరిపోయేవికావు. ఇప్పుడు కేసీఆర్ సల్లంగుండా నెలకు రూ.2016 ఇస్తున్నడు. ఆ డబ్బుతో ఆరోగ్యం బాగా లేకుంటే వైద్యం కోసం ఖర్చు చేస్తున్నా. ఆనందంగా గడుపుతున్నా. కేసీఆర్ మళ్లీ సీఎంగా చూడాలని ఉంది. వృద్ధులందరం కేసీఆర్కు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం.
– చట్ల లింగమ్మ, గుడిహత్నూర్
పెంచికల్ పేట్, అక్టోబర్ 19 : ఆంధ్ర పాలనలో రూ. 200 పింఛనే ఇచ్చేటోళ్లు. గా పైసలు ఎటూ సరిపోయేవి కావు. తెలంగాణ వచ్చి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పింఛన్ను రూ. 2016 చేసిండు. గీ డబ్బులతో నెలకు సరిపడా సరుకులు కొనుక్కుంటున్నం. మళ్లచ్చే ఎన్నికల్లో గెలిస్తే పింఛన్ను రూ. 5016కు పెంచుతమని మ్యానిఫెస్టోలో ప్రకటించిన్రు. ఇందుకు సంతోషంగా ఉంది. అన్ని వర్గాల బాగు కోరుతున్న బీఆర్ఎస్ సర్కారే మళ్లీ వస్తది. మేమంతా అయననే గెలిపించుకుంటం.
– చిన్నబోయిన చిన్నన్న, ఎల్లూర్
కడెం, అక్టోబర్ 19 : మాది కడెం మండలంలోని కొత్తమద్దిపడగ. నా భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందిండు. నాకు ముగ్గురు పిల్లలు. ఒకరికి పెళ్లి చేసి న. మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటూ వారిని చదివిస్తూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తు న్నా. నాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 2వేల వితంతు పెన్షన్ వస్తోంది. కూలీతో నా కుటుంబానికి ఆసరా అవుతున్నాయి. మ్యానిఫెస్టోలో రూ.3 వేలు ఇస్తామని ప్రకటించడంతో మాలాంటి కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది.
– తాటికంటి లక్ష్మి, కొత్తమద్దిపడగ, కడెం