జైనూర్, డిసెంబర్ 21 : ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రాధాన్యత కలిగిన గుస్సాడీ నృత్యం వందే భారతం కోసం ఎంపికైనట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి, నాగ్పూర్లో సౌత్స్థాయి పోటీల్లో బృందం ప్రతిభ కనబర్చింది.
మంగళవారం ఢిల్లీలో జరిగిన ప్రదర్శనతో గ్రాండ్ ఫైనల్కు చేరుకుంది. దీంతో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో బృందం సభ్యులు గుస్సాడీ నృత్యం చేసేందుకు ఎంపిక కావడంపై ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనలిచ్చిన బృందంలో పద్మశ్రీ కనకరాజు, టీం లీడర్ కనక సుదర్శన్, కళాకారులు నందు, దేవు, మారు, నగేశ్, సుధా, భీము ఉన్నారు.