చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 1: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మిమోస పోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు.
ప్రభుత్వం మద్దతు ధర ఏ-గ్రేడ్ రకానికి రూ. 2203, బీ-గ్రేడ్ రకానికి రూ. 2183 చెల్లిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్, తాగునీరు, నీడ, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్, ఏపీఎం ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.