పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు హక్కులు కల్పించేలా సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రత్యేక కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పటికే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 31,311 దరఖాస్తులు రాగా, వాటికి పరిష్కారం లభించే అవకాశముండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పోడు హక్కుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తామని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
గతంలో 31 ,311 మంది దరఖాస్తు
తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం గత నవంబర్, డి సెంబర్లో పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జి ల్లావ్యాప్తంగా 15 మండలాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు 31 ,311 మంది దరఖాస్తు చేసుకున్నారు. పో డు భూములు ఎన్ని ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారనే ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వారి నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది.
త్వరలోనే కార్యాచరణ ప్రారంభం..
పోడు భూములపై హక్కుల కోసం స్వీకరించిన దరఖాస్తులు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల నుంచే కాకుండా గిరిజనేతరుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. వీరిలో ఎస్టీల నుంచి 15 ,479 మంది, ఇతర రైతులు 15 ,832 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించేందుకు అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో కమిటీని వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే కమిటీ తన కార్యచరణను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రైతులు చేసిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో వెళ్లి కమిటీ విచారణ చేపడుతున్నది. అటవీ హక్కుల చట్టం 2005 ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు హక్కులు కల్పించనుండగా, మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనేతరుల పోడు సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.