బేల, డిసెంబర్ 21: ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా గోడం వర్ష, వైస్ చైర్మన్గా వేణుగోపాల్యాదవ్, పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈసందర్భంగా వారిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల నియామకాల్లోనూ రూల్ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి, సంక్షేమపథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్..
తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ అధినేత బీఆర్ఎస్గా మార్చారని చెప్పారు. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ముందుగా సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో ప్రచారాన్ని ముమ్మరం చేశారని తెలిపారు. ఈనెల 27న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా పర్యటన ఖరారైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహార్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, జిల్లా మార్కెట్ అధికారి శ్రీనివాస్, నాయకులు దుర్వ నగేశ్, రఘువీర్యాదవ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.