మంచిర్యాల ఏసీసీ, మార్చి 1 : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు శుక్రవారం ఐజీగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 14న డీఐజీ హోదాలో బాధ్యతలు స్వీకరించిన ఆయన, ప్రస్తుతం తన కార్యాలయంలో ఐజీగా విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా కమిషనరేట్లో సాయుధ పోలీసుల గౌరవాన్ని స్వీకరించారు. అనంతరం పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు