బెల్లంపల్లి, జనవరి 11 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైన బుక్యా పుష్పలత, బీ.కళ్యాణి, బీ.అక్షయ ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సిద్ధిపేట జిల్లా కొండాపూర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కళాశాల పీడీ బాబురావు తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను ప్రిన్సిపాల్ అంజయ్య, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ఎడ్ల సోమయ్య, లెక్చరర్లు ప్రత్యేకంగా అభినందించారు.